డిచ్ పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో బుదవారం రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా వరి ధాన్యం తడిసి పోయిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.తడిసిపోయిన ధాన్యం చూసి రైతులు కంటతడి పెడుతున్నారు.
ఈ తుఫాన్ ప్రభావం మరో రెండు మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ చెప్తుంది. కానీ ఇప్పటికీ సెంటర్లలో సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వెంటనే తార్పిన్ కవర్ లను రైతులకు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. .
