మైనర్టీ స్కూల్లో విద్యుత్ ఘాతంతో విద్యార్థికి గాయాలు..అలూర్ మండల కేంద్రం లోని మైనర్టీ స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థికి విద్యుత్ ఘాతంతో తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్లితే..సారంగపూర్ కి చెందిన సయ్యద్ అక్బర్ కుమారుడు సయ్యద్ రేహన్ ఆలూరు మండలం లోని మైనార్టీ హాస్టల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు రోజువారీగా స్కూల్ అయిపోయిన అనంతరం ఆడుకుంటున్న సమయంలో క్రికెట్ బంతి హాస్టల్ పైన పడటంతో తీసుకుందామని పైకి ఏక్కడు.
అక్కడ హైటేన్కషన్ వైర్లు షాక్ కోట్టడంతో చేతికి తీవ్రగాయం అయింది. గమనించిన స్థానికులు హుటహుటిన ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు.
గాయం తీవ్రత ఏక్కువగా ఉండటంతో మెరీనా చికిత్స కోసం జిల్లా ఆసుపత్రి తరలించారు.

Very sad. All students be alert for forther future.