తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడా పోటీల్లో భాగంగా రాష్ట్ర కబడ్డీ జట్టు ఎంపిక ప్రక్రియకు జిల్లాకు చెందిన కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పవన్కుమార్తో పాటు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగారెడ్డి, కార్యవర్గ సభ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్ను అభినందించారు. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీలో అవకాశం దక్కడం జిల్లా క్రీడాకారులకు గర్వకారణమని పేర్కొన్నారు.
