HomeTelanganaNizamabadవాడివేడిగా మొదటి కౌన్సిల్ సమావేశం ..నగరపాలక సంస్థలో జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశం వాడివేడిగా...

వాడివేడిగా మొదటి కౌన్సిల్ సమావేశం ..నగరపాలక సంస్థలో జరిగిన మొదటి కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది…

నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య లోపం, వీది దీపాలపై కార్పొరేటర్లు మేయర్ ఉమారాణి ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. నగరం నలుమూలలా అధ్వానంగా మారిన డ్రైనేజీలు, నిండని చెత్త కుండీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తమ డివిజన్లలో తిరగలేకపోతున్నామని పాలకపక్ష, ప్రతిపక్ష సభ్యులు ఏకమై అధికారుల వైఖరిని ఎండగట్టారు.

ఈ సమావేశానికి మేయర్ ఉమారాణి అధ్యక్షత వహించారు. సమావేశం ప్రారంభం కాగానే 60 డివిజన్ల కార్పొరేటర్లు సమస్యల వరదను మేయర్ ముందుంచారు. “ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు మమ్మల్ని డివిజన్లలోకి రానివ్వడం లేదు.

డ్రైనేజీ సమస్యలు, చెత్త పేరుకుపోవడం వంటి ఇబ్బందులను ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది, ఇన్‌స్పెక్టర్ల నిర్లక్ష్యం వల్ల నగరం అపరిశుభ్రంగా మారింది” అని సభ్యులు ఆరోపించారు.

సిబ్బంది కొరతతో పారిశుద్ధ్య నిర్వహణ కుంటుపడుతోందని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న డ్రైనేజీలు పూడిక తీయకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. పారిశుద్ధ్య విభాగంలో క్షేత్రస్థాయి సిబ్బంది లేక చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదని కార్పొరేటర్లు పేర్కొన్నారు.

శానిటరీ ఇన్‌స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదని, వారి తీరువల్లే సమస్యలు జటిలమవుతున్నాయని సభ్యులు విమర్శించారు.సమావేశంలో సమస్యలు ఏకరువు పెడుతుండటంతో కౌన్సిల్ హాల్ ఒక్కసారిగా వేడెక్కింది.

అధికారులు క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో ఎందుకు స్పందించడం లేదని కార్పొరేటర్లు నిలదీశారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం నుండి తగినంత నిధులు, స్పందన లేకపోవడం వల్ల తాము ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తోందని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి నగర పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments