నిజామాబాద్ నగర పాలక సంస్థలో మేయర్ ఉమారాణి అధ్యక్షతన మంగళవారం పాలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ హాజరయ్యారు.
నగరాభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. సమావేశంలో కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
