ఒంటరిగా ఉన్న వృద్ధుడి ని ఇంట్లోకి దూరి దారుణంగా హత్య చేసిన ఘటన మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధి లో జవహర్ నగర్ లో జరిగింది సంతోష్ నగర్లో దేవరాజ్ ను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ విచక్షణారహితంగా కొట్టి చంపేశారు.
మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది సంతోష్నగర్లో నివసించే వృద్ధుడు దేవరాజ్కు కుటుంబసభ్యులు ఎవరూ లేరు. దీంతో ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అదే కాలనీలో ఉంటున్న దేవా అనే యువకుడు అక్రమంగా చొరబడ్డారు.
అనంతరం దేవరాజ్ను విచక్షణారహితంగా కొట్టి హత్య చేశాడు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహం ను గాంధీ ఆసుపత్రికి తరలించారు
