దాదాపు ఎనిమిది ప్రైవేటు కాలేజీలు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరుతొ నకిలీ ఫైర్ ఎన్వోసీలను(NOC) సృష్టించిన కళాశాలలు.. వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా..ఈ విషయం వెలుగులోకి వచ్చిది .
ఏకంగా 8 ప్రముఖ ప్రైవేటు కళాశాలలు ఈ ఫోర్జరీ సంతకాలు, నకిలీ ఎన్ఓసీల ఆధారంగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించడం గమనార్హం , కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీ సర్టిఫికెట్లను తయారు చేశారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. నకిలీ ఎన్ఓసీ పత్రాలనే ఇంటర్మీడియట్ విద్యారంగంలో అఫిలియేషన్ పొందేందుకు సదరు 8 ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఈ క్రమంలోనే ఎన్వోసీ పరిశీలన సమయంలో సదరు సర్టిఫికెట్లు పూర్తిగా ఫేక్ అని.. వాటిపై ఉన్న కమిషనర్ సంతకం ఫోర్జరీ చేయబడిందని ‘హైడ్రా’, ఇంటర్ బోర్డు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
ఈ మొత్తం వ్యవహారంపై ‘హైడ్రా’ యంత్రాంగం రంగంలోకి దిగింది . ఫోర్జరీకి పాల్పడిన మొత్తం 8 ప్రైవేటు కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైడ్రా అడిషనల్ డైరెక్టర్లే లేక్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదును అందజేశారు.
ఫోర్జరీకి పాల్పడిన కాలేజీల్లో .
- హైందవి జూనియర్ కాలేజ్, బర్కత్పుర.
- రెసోనెన్స్ జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్.
- ప్రియాం జూనియర్ కాలేజ్, మెహదీపట్నం.
- మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, విద్యానగర్.
- శ్రీ చైతన్య జూనియర్, చంద్రాయణగుట్ట.
- న్యూ ఎరా జూనియర్ కాలేజ్, చిక్కడపల్లి.
- షాహీన్ జూనియర్ కాలేజ్, శివరాంపల్లి.
- వశిష్ట జూనియర్ కాలేజ్, తెల్లాపూర్లున్నాయి
