ఎన్హెచ్ 44 జాతీయ రహదారిపై చంద్రాయన్పల్లి శివారులో లారీ బోల్తా పడింది.ఈ ఘటన ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి శివారులో బుధవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. రోడ్డు మరమ్మతుల కోసం యాజమాన్యం చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
