గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ సోమవారం ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుదవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్లు మూసేయాలని ఆదేశించారు.
ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
