వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ లో చొరబడ్డ దొంగలు భారీ దోపిడీ కి పాల్పడ్డారు. ముఖ్యంగా నగదు జోలికి వెళ్లకుండా లాకర్లో భద్రపరిచిన బంగారం ఎత్తుకెళ్లారు.గ్యాస్ కట్టర్ తో లాకర్ వైపు ఉన్న కిటికీని కట్ చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించిన దొంగలు.. లాకర్ లను పగల గొట్టి ఖాతాదారులు దాచుకున్న బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు అయితే ఎంత మొత్తం గోల్డ్ చోరీ అయిందనే స్పష్టంగా చెప్పా లేక పోతున్న బ్యాంకు అధికారులు సుమారు 10 కోట్ల విలువైన బంగారం చోరీ అయి వుంటుందని ఓ అంచనా గా చెప్తున్నారు.
