నిర్మల్ జిల్లా కేంద్రంలోని అనంతపేట్ లో ఉన్న కేబీబీవీ విద్యార్థినుకు హాస్టల్ నిర్వాహులు ఉడికీ ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అది తిని తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది.
మొత్తం 10 మంది విద్యార్థినులు వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లుగా సమాచారం. విద్యార్థినులను చికిత్స నిమిత్తం హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఐదుగురి పరిస్థితి మెరుగుపడటంతో తిరిగి పాఠశాలకు పంపించారు. మరో ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
