సాక్షాత్తు దైవ సన్నిధిలోనే దొంగలు చేతివాటం ప్రదర్శించారు. నిత్యం భక్తులతో కళకళలాడే గోల్ హనుమాన్ ఆలయ కార్యదర్శి జేబుకి కన్నం వేశారు. వివరాల్లోకి వెళ్లితే.. సోమవారం డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే ముందు గోల్ హనుమాన్ లో దర్శించుకున్నారు.
ఈ క్రమంలో ఆలయంలో ఎక్కువ మంది గుమిగూడడంతో ఏకంగా గోల్ హనుమాన్ ఆలయ కార్యదర్శి వేణు జేబులో ఉన్న రూ 50 వేలు చోరి చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన స్థానిక రెండవ టౌన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా విచారణ చేపట్టినట్లు తెలిపారు.
