Thursday, April 30, 2026
HomeTelanganaNizamabadఅనాథ శవానికి 'ఇందూరు యువత' అంతిమ సంస్కారాలు..

అనాథ శవానికి ‘ఇందూరు యువత’ అంతిమ సంస్కారాలు..

సమాజంలో బంధుత్వాలు కనుమరుగవుతున్న వేళ, మానవత్వమే మిన్న అని నిరూపించింది నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ‘ఇందూరు యువత’ స్వచ్ఛంద సేవా సంస్థ. ఎవరూ లేని ఓ అనాథ మృతదేహానికి కన్న బిడ్డల వలె దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించి తమ ఉదారతను చాటుకున్నారు.

ఆర్మూర్ పట్టణంలో ఓ వ్యక్తి అనాథగా మృతి చెందగా, ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని స్థానిక పోలీసు సిబ్బంది ఇందూరు యువత సంస్థను కోరారు. పోలీసుల విన్నపానికి తక్షణమే స్పందించిన సంస్థ ప్రతినిధులు, ఆ బాధ్యతను భుజానికెత్తుకున్నారు.

గురువారం ఆర్మూర్ లోని దేవి థియేటర్ పక్కన గల సార్వజనిక్ శ్మశాన వాటికలో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మరణించిన వ్యక్తికి ‘నా’ అనే వారు లేకపోయినా, తామే వారమై అన్ని తానై ఆ యువకులు అంతిమ యాత్రను పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, తిరుమల శ్రీనివాస్, గంగారాం, ఆర్మూర్ పోలీస్ సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు. దిక్కులేని శవానికి అండగా నిలిచిన యువతను పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!