తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో జరిగిన ఈ భేటీలో అయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. గవర్నర్కు ఉన్న విశేష పరిపాలనా అనుభవం, చారిత్రక సమకాలీన అంశాలపై వారికి ఉన్న లోతైన అవగాహన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.
వారి మేధస్సు, అనుభవం ద్వారా మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఎంతగానో లబ్ధి పొందుతుందని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
