మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి నలుగురికి జైలు శిక్ష 35 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో 39మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ తేదీ 25.08.2025 నాడు కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ మేడం ముందర హాజరుపరచగా 35 మందికి 54500 /– జరిమానా విధించి,1 ఈర్లపల్లి గణేష్, రాపూల్ శివాజీ గౌడ్, దేవల శ్రీధర్ వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష, అలాగే బోర్లి సురేష్ కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
