బాన్సువాడ పట్టణంలో ..జిలెటిన్ స్టిక్స్ బయటపడటం కలకలం రేపింది. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ భర్త నర్సుగొండ, తన ప్లాట్లో బండరాళ్లను తొలగించేందుకు.
40 జిలెటిన్ స్టిక్స్ మరియు పౌడర్ పేలుడు పదార్థాలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ..తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
అనుమతుల్లేకుండా వీటిని నిల్వ ఉంచి ఉపయోగించేందుకు సిద్ధం అయినట్లు సీఐ అశోక్ తెలిపారు. ఈ ఘటనపై నర్సుగొండపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
