మున్సిపాలిటీ కార్మికురాలిని ఢీకొట్టిన ఆటో డ్రైవర్ కి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు.వివరాల్లోకి వెళ్లితే.
నగరంలోని బ్యాంక్ కాలనీలో మున్సిపల్ కార్మికురాలు నీమ్మరాజు సాయమ్మ విధులు చేస్తుండగా ఆటోనగర్ కు చెందిన అబ్దుల్ మాజిద్ మద్యం మత్తులో ఢీ కొట్టడంతో గాయలయ్యాయి.
దీంతో అబ్దుల్ మజీద్ పై కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
