Monday, May 4, 2026
HomeCRIMEఅక్రమ నిర్మాణాలను తొలగించిన రెవెన్యూశాఖ..

అక్రమ నిర్మాణాలను తొలగించిన రెవెన్యూశాఖ..

ఫిలింనగర్ పద్మాలయా అంబేద్కర్ నగర్ లో అక్రమ కట్టడాలను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.వివరాలలోకి వెళ్తే పద్మయా అంబేడ్కర్ నగర్ బస్తీలో తరుచు అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉండటం సర్వసాధారణం .

ఈ బస్తీలో ప్రభుత్వ భూమి చాలా ఉంది. ప్రభుత్వ పాఠశాల అనుకోని ఉన్నా ఖాళీ స్థలాలలో మళ్ళీ అక్రమ కట్టడాలు వెలిశాయి.

ఈ విషయాన్ని స్థానికులు షేక్పేట ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు. TS No. 1, Block-F, WardNo -9 సంబంధించి సర్వే నెంబర్ 403 షేక్ పెట్ విలేజ్ పద్మల అంబేద్కర్ నగర్ ప్రభుత్వ స్థలంలో డొక్కా ఉమా w/o డొక్కా సురేష్ సంబంధించి 50 గజాల స్థలం వారికి ఉండగా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కలుపుకొని సుమారుగా 180 గజాల స్థలాన్ని ఆక్రమించడం జరిగింది.

అయితే ఈ 50 గజాల స్థలం సామ్ సంబంధించి ఎలాంటి పత్రాలను సదరు కబ్జా దారులు చూపించలేకపోయారు. దీనితో షైక్పేట్ ఏమ్మార్వో వై. అనిత రెడ్డి, ఈ అక్రమ నిర్మాణం మొత్తం తొలగించారు.

ప్రభుత్వ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని రెవిన్యూ సిబ్బంది తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!