ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి కింద పడి యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన నగరంలోని అర్సపల్లి లో చోటు చేసుకుంది.
రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని శాంతి నగర్ కు చెందిన అబ్దుల్ వహీద్(29) రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
