Wednesday, April 22, 2026
HomeCRIMEఆన్‌లైన్‌ బెట్టింగ్ కు బిటెక్ విద్యార్థి బలి .

ఆన్‌లైన్‌ బెట్టింగ్ కు బిటెక్ విద్యార్థి బలి .

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడి ఆన్ లైన్ యాప్ లో లోన్ తీసుకోని చెల్లించలేక ఓ బీటెక్ స్టూడెంట్ ఆత్మ హత్య కు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

బీటెక్ చదువుతున్న వినీత్ ఐపీఎల్‌లో క్రికెట్ లో బెట్టింగ్‌లకు బానిస గా మారాడు .కానీ బెట్టింగ్ లకు అవసరమైన నగదు కోసం అన్ లైన్ లో యాప్‌ల ద్వారా అప్పులు తీసుకున్నాడు.

అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో చేసేదేంలేక, ఇంట్లో చెప్పుకోలేక ఆత్మ హత్యకు పాల్పడ్డాడు . విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!