దసర పండుగ సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లే వారు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు.
ఉదయం రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు …పూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువు లను విక్రయించే వారి పై ” నిఘా” పెట్టండిరాత్రపూట అనుమానంగా సంచరించే వారిని ప్రశ్నించాలన్నారు శివారు ప్రాంత కాలనీలలో తాళం వేసిన ఇండ్లను పగలు గుర్తించి రాత్రి వేళ చోరీలకు పాల్పడుతారని పండగ కు ఉరికి వెళ్లితే ఇరుగు పొరుగు వారిని ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పాలి వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకొని ఇంటి కి వచ్చేలా ప్రణాళిక వేసుకోవాలి .
ఒకవేళ ఉరికి వెళ్లినా సరే పక్కింటి వారి ద్వారా తమ ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి వెళ్లకూడదు.
ఊరు వెళ్లేటప్పుడు ఖరీ దైన వస్తువులు బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం మంచిది.
తాళం వేసి ఊరు వెళ్లే ముందు మీ సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి పోలీస్ లకు అనుమానితుల సమాచారం అందించి దొంగతనాల నివారణకు సహకరించాలి ప్రత్యేకంగా మీ చుట్టు ప్రక్కల వారి ల్యాండ్ ఫోన్ నెంబరు (లేదా) సెల్ ఫోన్ నెంబర్లు మీదగ్గర ఉంచుకోవాలి .
ముఖ్యంగా మీరు ఉరికి వెళ్తున్న విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు.
ప్రయాణం పూర్తయ్యక , ఇంటికి వచ్చిన తరువాత మాత్రమే ఫోటోలు, సమాచారం షేర్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వదలుచుకునేవారు మీ సమీప పోలీస్ స్టేషన్లను సంప్రదించండి. లేదా డయల్ 100 ను సద్వినియోగం చేసుకావాలన్నారు
