ఎహే గాంధీజయంతి అయితే ఏందీ ఆ మా నాయకుడు పర్మిషన్ ఇచ్చేసాడు మమ్మలి ఎవ్వడు ఆపేది అంటూ యథేచ్ఛగా మాంసం అమ్మకాలు సాగించారు. ఎప్పటిలాగే అధికార యంత్రాంగం డూ డూ బసవన్న లా మారారు.
జిల్లా కేంద్రంలోనే ఉన్నత స్థాయి అధికారుల సాక్షిగా యథేచ్ఛగా యాటల లను తెగ నరికారు. విచ్చల విడిగా మాంసం అమ్మకాలు సాగించారు. అదేమీ చాటు మాటున కాదు ఓపెన్ గా అందులోనూ ఏకంగా కిలో మీద వంద రూ పాయలు పెంచేసి.
దసరా పండగ నాడే గాంధీ జయంతి ఉండడంతో మాంసం ఈసారి పండగ నాడు దసరా పండగ నాడు యాటలు కోసి మద్యం తో దావత్ చేసుకోవడం ఆనవాయితీ .! కానీ ఈ యేడాది దసరా పండగ అక్టోబర్ రెండో తేదీ న వచ్చింది అంటే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కదా అహింస ఆయుధంమని చెప్పిన ఆయనజయంతి నాడు జంతువుల బలి మీద ఆంక్షలున్నాయి.
కానీ అదే రోజు పండగ వుండడంతో ప్రభుత్వం ఏదైనా సడలింపులు ఇస్తుందేమో నని ఎదురు చూసారు. కానీ ఎప్పటిలాగే మద్యం మాంసం అమ్మకాల బ్యాన్ ను కొనసాగించింది. సరే మారు మూల ప్రాంతాల్లో పండగ రోజు మాంసం మద్యం అమ్మకాలను నియంత్రించడం అంత సుళువేమీ కాదు.
కానీ జిల్లా కేంద్రంలో కూడా యంత్రాంగం చేతులు ఎత్తేసింది. పండగ మజా చేసుకునే వీలు కల్పించింది ఎలాగో మాజీ మంత్రి కూడా గట్టిగా చెప్పాడు కదా..
