నిజామాబాద్ నాలుగవ టౌన్ ఎస్హెచ్ఓ గా సతీష్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ ను అప్గ్రేడ్ చేశారు.
ఈమేరకు నాలుగు రోజుల క్రితం సీఐ లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సీసీఆర్బి లో సీఐ గా పని చేస్తున్న సతీశ్ కుమార్ ను నాలుగవ టౌన్ కు ఎస్హెచ్వో గా బదిలీ చేశారు.దీంతో ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
