బెట్టింగ్ లకు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రెంజల్ మండలం కూనెపల్లి లో జరిగింది గ్రామానికి చెందిన యువకుడు (28) గత కొంతకాలంగా బెట్టింగ్ బానిసై భారీగా అప్పులు చేశాడు.
వాటిని తీర్చలేక, అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఉన్నకాస్తా పోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్..ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
