ఈనెల 17 నుండి 20 వరకు గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాదులో జరుగుతున్న రాష్ట్ర బేస్ బాల్ సీఎం కప్ పోటీలలో జిల్లా జట్టు తరఫున సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి విద్యార్థులుపాల్గొంటున్నట్లు పాఠశాల బి. నిషిత, డి. లికిత ప్రిన్సిపల్ టి నళిని తెలిపారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలలో జిల్లా బేస్బాల్ జట్టును ప్రథమ స్థానంలో నిలుపు జిల్లాకు మరియు పాఠశాలకు పేరు తీసుకురావాలన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ స్వప్న, జూనియర్ వాయిస్ ప్రిన్సిపాల్ వనిత,పిఈటి నర్మద పిడి జోష్నా, మరియు అకాడమీ కోచ్ వేముల మౌనిక పాల్గొన్నారు.
