గ్రామీణ ప్రాంతాల్లో ఐస్ క్రీమ్ అమ్మకాల ఫై ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి కనీస నాణ్యత లేని ఐస్ క్రీమ్ లతో అనారోగ్యాలకు గురవుతున్నామనే ఆందోళన గ్రామీణల్లో వ్యక్తం అవుతుంది అందుకే ఐస్ క్రీమ్ అమ్మకాలఫై గ్రామాల్లో ఆంక్షలు అమల్లోకి తెస్తున్నాయి
ఇందుకోసం గ్రామాభివృద్ధి సంఘాలు మూకుమ్మడిగా కదులుతున్నాయి గ్రామంలోకి ఐస్ క్రీమ్ అమ్మేవారికి ప్రవేశం లేదంటూ తీర్మానాలు చేస్టున్నాయి ఈ మేరకు భారీ ఫ్లెక్సీ లను గ్రామ ప్రవేశమార్గాల్లో ఏర్పాటు చేస్తున్నారు అంతే కాదు తమ ఆంక్షలు ఉల్లఘించే వారికి జరిమానా లు సైతం విధిస్తామని స్పష్టం చేస్తున్నాయి.
పోతంగల్ మండలంలోని హంగర్ గా గ్రామంలో తమ గ్రామంలో నాసిరకం ఐస్ క్రీం ని అమ్మితే మరియు చిప్స్ లాంటి నాసిరకం వస్తువులను పంపితే 5000 రూపాయలు జరిమానని విధిస్తామని అందరికి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఫ్లెక్సీ ని నిర్వహించారు
తొందరగా గ్రామానికి చెందిన సర్పంచ్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ బయట నుంచి వచ్చే తోపుడు బండ్లు నాణ్యత లేని రంగు రసాయనాలు కలిపిన ఐస్ క్రీములు అమ్ముతున్నారని వీటివల్ల పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తుల ఆధ్వర్యంలో చర్చి ంచి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు
ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రూపాయలు ఐదువేల జరిమానా విధిస్తామని మీతో పాటు నాసిరకం చిప్స్ ప్యాకెట్లు అమ్మ వద్దని ప్రచారం చేస్తున్నారు
