నగరంలోని పులాంగ్ ప్రాంతంలో కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని అశ్మి కాలనీకి చెందిన సోహైల్ ఖాన్ అనే వ్యక్తిపై శనివారం రాత్రి ఈ దాడి జరిగింది.
బాధితుడు పులాంగ్ ప్రాంతంలో ఉన్న సమయంలో, ఒక ఐదుగురు వ్యక్తులతో కూడిన దుండగుల గ్యాంగ్ ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడికి తెగబడింది. ఈ దాడిలో సోహైల్ ఖాన్కు తీవ్ర కత్తిపోట్లు కావడంతో రక్తస్రావమైంది.
వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందా లేదా మరేదైనా వివాదం ఉందా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
