విద్యుత్ ఘాతంతో వ్యక్తిగత చెందిన ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.ఇంచార్జీ ఎస్ఐ నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని నాందేడ్ కు చెందిన కొట్టూరి శ్రీనివాస్ (45). భార్య పిల్లలు ఉన్నట్లు తెలిపారు.
సోమవారం సాయంత్రం నీటి కుళాయి కి మోటర్ పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం తో కుప్పకులాడు.
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంచార్జీ ఎస్ఐ నర్సయ్య తెలిపారు.
