ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో గల అర్సపల్లి లో గురువారం రాత్రి ఘటన చోటు చేసుకుంది.
ఎస్ఐ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం. బోధన్ కు చెందిన షేక్ గౌష్ (60). తన ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఐచర్ వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు.
