ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తున్న సందర్భంలో 108 అంబులెన్స్ లో ప్రసవించిన ఘటన బోధన్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి…
సాలూరు మండల కేంద్రానికి చెందిన గౌసియ బేగం రెండవ సారి గర్భం దాల్చింది. పురిటి నొప్పులు రావడంతో 108 లో శనివారం వేకువ జామున బోధన్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
108 ఉద్యోగులు ఈ ఎం టీ మహేష్, పైలట్ సాయిలు, ఆశ కార్యకర్త లలిత గర్భిణీ మహిళకు ప్రసవం నిమిత్తం సేవలు అందించారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. బోధన్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు.
