నిజామాబాద్ నగరంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వరాష్ట్రం కోసం పరితపించి తెలంగాణ వాది మాజీ మంత్రివర్యులు భారత దేశ సమరయోధుడు తొలి మలిదశ ఉద్యమ నేత బీసీ ముద్దుబిడ్డ కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.
కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు వైశాక్షి సంతోష్ ,ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు వినయ్, డిసిసి డెలిగేట్ లవంగ ప్రమోద్, మోస్ర మండల అధ్యక్షుడు శ్రీనివాస్, 50 డివిజన్ ఇంచార్జ్ అవిన్, శోభన్ ,రూపేష్ రెడ్డి, అదే ప్రవీణ్ ,దిలీప్ ,వెంకటేష్, దేవదాస్ ,శేఖర్ ,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
