తప్పులు చేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా జడ్జి కుంచాలా సునీత పేర్కొన్నారు.
బుధవారం నిజామాబాద్ జిల్లా పరిధిలో గల జిల్లా జైలులో గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం వేడుకలను జిల్లా జైలు సూపరింటెండెంట్ ఆనంద్ రావు పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కోపాన్ని తగ్గించుకుంటే నేరాలు జరిగే అవకాశం ఉండదని, క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడి జైలుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు.
నేర ప్రవృతిని విడనాడి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తయారు కావాలని సూచించారు. ఈ కార్యక్రమానికి
