అసెంబ్లీ భవనం వద్ద భారీ గాలి దుమారం చెలరేగింది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అసెంబ్లీ ప్రాంగణంలోని ఎమ్మెల్యేల ప్రవేశ ద్వారం (ఎంట్రన్స్ గేట్) వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది.
చెట్టు కూలిన సమయంలో ఆ ప్రాంతంలో గేటు వద్ద ప్రమాదం జరిగిన సమయంలో జనసంచారం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అసెంబ్లీ సెక్యూరిటీ, సచివాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిబ్బంది రంగంలోకి దిగి ఆధునిక యంత్రాల సహాయంతో విరిగిపడిన చెట్టు కొమ్మలను కట్ చేసి, అక్కడి నుండి వేగంగా తొలగించారు.
