ఆర్మూర్ పట్టణంలోని సుప్రసిద్ధ దేవస్థానం శ్రీ నవనాథ సిద్దులగుట్ట దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
నవనాధా సిద్దేశ్వర ఆలయంలోని హుండిని పగలగొట్టి డబ్బులు అలాగే స్వామివారి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ తెలిపారు.
అంతేగాక అయ్యప్ప దేవాలయం హుండీని పగలగొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించామన్నారు.
