నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని హిజ్రా మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుమారు 40 ఏళ్ల వయసున్న హిజ్రా ఈ నెల 8న స్పృహతప్పి పడిపోవడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.
ఈ మేరకు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలి కుడిచేతిపై ‘అమ్మ’ అనే పచ్చబొట్టు, ఎడమచేతిపై రెండు ‘M’ అక్షరాల గుర్తులతో కూడిన పచ్చబొట్లు ఉన్నాయి.
ఆమె వివరాలు తెలిసిన వారు నిజామాబాద్ వన్టౌన్ పోలీసులను లేదా 8712659714 నంబరులో సంప్రదించాలని పోలీసులు కోరారు.
