జుక్కల్ బిఆర్ యస్ నేత మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వినూత్న నిరసనకు దిగారు. బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులలో జాప్యం ను నిరసిస్తఈ ఆందోళన చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిచ్కుంద అభివృద్ధి కుంటుపడుతున్నదని, అభివృద్ధి పనులు లేక అవస్థలు ఎదురవుతున్నాయని అన్నారు.
చిన్నపాటి వర్షానికి మోకాలు లోతు నిలిచిన బురద నీళ్లలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి బిఆర్ యస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు
