తెలంగాణలో మత సామరస్యానికి ప్రతీకగా జరిగే మొహరం (పీర్ల) పండుగ శుక్రవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మతాల అతీతంగా పీర్ల ఊరేగింపు లో పాల్గొన్నారు స్థానికులే కాకుండా, ఇతర గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు.
భక్తులంతా కుడుక బెల్లం అగర్బత్తిలతో పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అగ్నిగుండం చుట్టూ ఆడుతూ అసైదుల పాటలతో హోరెత్తించారు.జిల్లా కేంద్రంలో ఆయా ప్రాంతాల్లో పీర్ల ఊరేగింపు నిర్వహించారు
