రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి శివారులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ఆర్వో రవిమోహన్ భట్ ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.
చిరుత కళేబరాన్ని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. గతంలో ఇదే ప్రాంతంలో చిరుతలు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి.