HomeDevotionalవచ్చే నెలలో నే లష్కర్ బోనాలలు నెల రోజల పాటు జరగనున్న ఉత్సవాలు ......మొదలైన...

వచ్చే నెలలో నే లష్కర్ బోనాలలు నెల రోజల పాటు జరగనున్న ఉత్సవాలు ……మొదలైన ఏర్పాట్లు

వచ్చే నెలలోనే హైదరాబాద్ బోనాల జాతర ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఆషాఢ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని జూలై 19న గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తొలి బోనం సమర్పిస్తారు. అప్పటి నుంచి నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు జరుగుతాయి .

నాటి నుంచి ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణలు ఉంటాయి.ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టాలు ఆగస్టు మొదటి వారంలో జరగనున్నాయి. ఆగస్టు 2 (ఆదివారం): లష్కర్ (సికింద్రాబాద్) ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు నగరంలోని ప్రధాన ఆలయాల్లో అమ్మవారికి భక్తులు పెద్ద ఎత్తున బోనాలను సమర్పిస్తారు.

ఆగస్టు 3 (సోమవారం): సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో పవిత్ర ‘రంగం’ (భవిష్యవాణి) కార్యక్రమం, అనంతరం అంబారీపై అమ్మవారి సాగనంపే ఊరేగింపు వైభవంగా జరుగుతాయి. గోల్కొండతో ప్రారంభమయ్యే ఈ జాతర.. ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల ఉత్సవాలతో ముగుస్తుంది.

ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఘటాల సామూహిక ఊరేగింపు. గజరాజుపై అమ్మవారి శోభాయాత్రతో ఈ ఏడాది ఆషాఢ బోనాల జాతర ముగియనుంది. బోనాల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు ఏర్పాటు చేస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments