పౌర, హక్కుల నేత , ప్రముఖ న్యాయవాది గోర్రెపాటి మాధవరావు కన్నుమూశారు. మాధవరావు భౌతికకాయాన్ని విద్యార్థుల పరిశోధనల కోసం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అలాగే నేత్రాలను లయన్స్ క్లబ్కు ఇవ్వనున్నారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
