నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ శుక్రవారం 49వ డివిజన్ పరిధిలో పర్యటించారు.
నగరంలోని 49 వ డివిజన్ లో ఫిక్చర్ ప్యాలెస్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిశీలించి పలు సూచనలు చేశారు.అనంతరం డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి కార్పొరేటర్ మెట్టు విజయ్ తో కలిసి మాట్లాడారు.
అదేవిధంగా గణేష్ నిమజ్జనానికి వెళ్ళే మార్గంను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ మెట్టు విజయ్, ట్రాఫిక్ పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
