కలుషిత నీరు తాగి 70 గొర్రెలు మృతి చెందాయి ఈ ఘటన ధర్పల్లి మండలం హొన్నాజీ పేట్ లో జరిగింది గొర్రెలు మృత్యువాత పడ్డ
విషయం తెలుసుకున్న ధర్పల్లి తాహసిల్దార్ బి.మాలతి సంఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన గొర్లను పరిశీలించారు.
మృత్యువాత పడ్డ గోర్లు హొన్నాజీపేట్ గ్రామానికి చెందిన కురుమ పెద్ద రాజయ్య మరియు కురుమ గంప పెద్ద రాజయ్య లవి గా గుర్తించామని సుమారు 70 గోర్లు మృత్యువాతపడగా వాటిని పంచనామ నిర్వహించారు.
అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన గోర్లు కలుషితమైన నీరు తాగడం వల్లే మృతి చెంది ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు