రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనున్నది.
దీనితో ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధి లో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలున్నాయిదీనితో జిల్లాలో ఎన్నికల నియమావళి ని అమలు చేయనున్న .
3 ఫిబ్రవరి నోటిఫికేషన్ 10 ఫిబ్రవరి : నామినేషన్ లకు చివరి రోజు 11 ఫిబ్రవరి :నామినేషన్ ల పరిశీలన 13 ఫిబ్రవరి :నామినేషన్ల ఉపసంహరణ 27 ఫిబ్రవరి:.పోలింగ్ 3 మార్చి: కౌంటింగ్
