గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని గంజి మార్కెట్ దగ్గర అందజ వయసు 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని పై టీ షర్ట్ మరియు నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. వృతుని వివరాలు తెలిసిన వారు ఫోన్ నెంబర్ 8712659714 ఒకటవ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సీఐ రఘుపతి పేర్కొన్నారు.
