మేరకు NZB మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TUCI రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ పాల్గొని ప్రసంగించారు. అయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పెరుగుతున్న జీవన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు నెలకు కనీసం ₹26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, NMR విధానాలను వెంటనే రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ నిరసనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.
