ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో రాత్రి 44వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ..
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి బలమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మరికొందరికి గాయాలయ్యాయన్నారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు
