స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధ ఎట్టకేలకు తొలిగిపోయింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. లోకల్ బాడీ ఎన్నికల కు సంబంధించి దాఖలైన 6 పిటిషన్ లపై జస్టిస్ టి మాదవి ధర్మసనం తుది తీర్పు ఇచ్చింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు . సెప్టెంబర్ 30లోపు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలని డెడ్లైన్ విధించారు. 30 రోజుల్లో వార్డు విభజన చేయాలని ఆదేశించారు. అయితే, విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది స్థానిక ఎన్నికల నిర్వహణకు 30 రోజలు గడువును కోరారు.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం 60 రోజుల సమయం కోరింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేశారు.మరో వైపు అధికార పార్టీ సైతం ఈ ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవుతుంది.
గాంధీ భవన్ జరిగిన సమావేశాల్లో సీఎం రేవంత్ సైతం ఎన్నికలకు సిద్ధం కావాలని 99 శాతం సీట్లు గెలవాలని పిలుపు నిచ్చారు
