జిల్లాలో పలు దాబాల ఫై టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడులు జరిగాయి.ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ అంజయ్య ఎస్సై గోవింద్ లు ఈ దాడులు చేసారు.
మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నేషనల్ హైవే పైఆర్ ఎన్ యం ఢాబా హోటల్ పై రైడ్ చేసి దాబా ఓనరురొయ్యల నాగభూషణంను సీజ్ చేసిన మద్యాన్ని తదుపరి చర్య నిమిత్తం మోర్తాడ్ పోలీసులకు అప్పగించారు .
వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గల నేషనల్ హైవే పై మయూరి ధాబాయందు సైతం దాడి చేశారు మద్యం స్వాధీనపరచుకొని మయూరి దాబా ఓనరు అగ్గు మైపాల్ తో పాటు సీజ్ చేసిన మద్యాన్ని తదుపరి చర్య నిమిత్తం వేల్పూర్ పోలీస్ లకు అప్పగించనైనది.
