కామారెడ్డి శివారు లోని టేక్రియాల్ జాతీయ రహదారిపై భారీ దారి దోపిడీ జరిగింది.మొబైల్స్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు లో నుంచి సుమారు పది లక్షల విలువైన మొబైల్స్ బాక్సులను ఎత్తుకెళ్లారు ..
మొబైల్స్ లోడుతో వెళ్తున్న ట్రక్కును డ్రైవరు శుక్రవారం రాత్రి రహదారిపై ఓ దాబా వద్ద నిలిపారు. సుమారు రూ. 10 లక్షల విలువైన..
తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ట్రక్కు తలుపులు తెరిచి రెండు మొబైల్ బాక్సులను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారుగా రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఘటనాస్థలికి చేరుకుని ఆధారాల కోసం అన్వేషించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు లు తెలిపారు .
