నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం గన్నారం గ్రామం లో “ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షులు” కార్యక్రమం శనివారం నాడు ఉత్సాహంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఇంటి ఇంటికీ బీజేపీ భావనతో సాగుతున్న ఈ కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లే గొప్ప సాధనంగా మారుతోంది. మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా వేగంగా ప్రయాణిస్తోంది.అని తెలిపారుబూత్ స్థాయి నాయకుల పాత్ర అత్యంత కీలకం.
గ్రామ స్థాయిలో కేంద్ర పథకాలు ప్రతి ఒక్కరికీ చేరేలా కార్యకర్తలు నిబద్ధతతో పని చేయాలి. ప్రజలు నమ్మే పార్టీగా బీజేపీ నిలుస్తోంది.” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేతలు గన్నారం గ్రామంలో ఇంటి ఇంటికీ తిరిగి, కేంద్ర పథకాలు, మోదీ గారి పాలన విశేషాలు వివరించారు. కరపత్రాలు అందజేశారు.
ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ఆవాస్ యోజన, ఉజ్జ్వల, ఆయుష్మాన్ భారత్, పీఎం కిసాన్, జనధన్, హర ఘర్ జల్, బేటీ బచావో తదితర పథకాలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
